Vande Bharat Express: యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ బుకింగ్స్ ఎప్పటినుంచంటే..

తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు తీసేందుకు సిద్ధమైంది. రేపటి నుంచి ఈ సెమీ హైస్పీడ్ రైలు అందుబాటులోకి రానుంది. సంక్రాంతి కానుకగా దేశంలోని 8వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (జనవరి 15, 2023) ఉదయం 10.30 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

|

Updated on: Jan 14, 2023 | 6:07 PM

తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు తీసేందుకు సిద్ధమైంది. రేపటి నుంచి ఈ సెమీ హైస్పీడ్ రైలు అందుబాటులోకి రానుంది. సంక్రాంతి కానుకగా దేశంలోని 8వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (జనవరి 15, 2023) ఉదయం 10.30 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి బుకింగ్స్‌ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు వందే భారత్‌ రైలులో ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ప్రయాణ ఛార్జీలను కూడా ఇండియన్ రైల్వే వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు తీసేందుకు సిద్ధమైంది. రేపటి నుంచి ఈ సెమీ హైస్పీడ్ రైలు అందుబాటులోకి రానుంది. సంక్రాంతి కానుకగా దేశంలోని 8వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (జనవరి 15, 2023) ఉదయం 10.30 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి బుకింగ్స్‌ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు వందే భారత్‌ రైలులో ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ప్రయాణ ఛార్జీలను కూడా ఇండియన్ రైల్వే వెల్లడించింది.

1 / 12
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు మాదిరిగానే.. సికింద్రాబాద్ టూ తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలు కూడా ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందట. ప్రస్తుతం, సికింద్రాబాద్ – త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరు మీదుగా తిరుపతికి పరుగులు పెడుతున్నాయి. వీటి ప్రయాణ సమయంలో దాదాపు 12 గంటలు. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని 8 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు మాదిరిగానే.. సికింద్రాబాద్ టూ తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలు కూడా ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందట. ప్రస్తుతం, సికింద్రాబాద్ – త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరు మీదుగా తిరుపతికి పరుగులు పెడుతున్నాయి. వీటి ప్రయాణ సమయంలో దాదాపు 12 గంటలు. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని 8 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

2 / 12
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఈ రైలు (20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఒక నిమిషం పాటు ఆగనుంది. ఈ మేరకు ప్రయణానికి సంబంధించిన ఛార్జీల వివరాలను రైల్వే ప్రారంభించింది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఈ రైలు (20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఒక నిమిషం పాటు ఆగనుంది. ఈ మేరకు ప్రయణానికి సంబంధించిన ఛార్జీల వివరాలను రైల్వే ప్రారంభించింది.

3 / 12
Vande Bharat Express

Vande Bharat Express

4 / 12
రైల్వే.. వందేభారత్ ట్రైన్ నెంబర్, ఛార్జీల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. భోజన సదుపాయం వద్దనుకుంటే.. ఛార్జీలు తగ్గనున్నాయి. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మధ్య పరుగులు తీయనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. విశాఖ.. సికింద్రాబాద్ మధ్య 700 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది.

రైల్వే.. వందేభారత్ ట్రైన్ నెంబర్, ఛార్జీల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. భోజన సదుపాయం వద్దనుకుంటే.. ఛార్జీలు తగ్గనున్నాయి. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మధ్య పరుగులు తీయనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. విశాఖ.. సికింద్రాబాద్ మధ్య 700 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది.

5 / 12
పునరాభివృద్ది కానున్న సికింద్రాబాద్ స్టేషన్‌లో విశాలమైన డబుల్-లెవల్ రూఫ్ ప్లాజా తో పాటు రిటైల్ షాపులు, ఫలహారశాలలు, వినోద సౌకర్యాలు, ప్రయాణీకుల రాక/నిష్క్రమణలు వేర్వేరుగా, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు, ట్రావెలేటర్‌లు, మల్టీలెవల్ కార్ పార్కింగ్ వంటి ఎన్నో సౌకర్యాలతో పాటు రైలు ఎక్కావల్సిన, దిగవలసిన ప్రయాణికులకు అంతరాయం లేకుండా ఇతర  రవాణా మార్గాలతో మల్టీమోడల్ కనెక్టివిటీ అందించనుందని. దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

పునరాభివృద్ది కానున్న సికింద్రాబాద్ స్టేషన్‌లో విశాలమైన డబుల్-లెవల్ రూఫ్ ప్లాజా తో పాటు రిటైల్ షాపులు, ఫలహారశాలలు, వినోద సౌకర్యాలు, ప్రయాణీకుల రాక/నిష్క్రమణలు వేర్వేరుగా, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు, ట్రావెలేటర్‌లు, మల్టీలెవల్ కార్ పార్కింగ్ వంటి ఎన్నో సౌకర్యాలతో పాటు రైలు ఎక్కావల్సిన, దిగవలసిన ప్రయాణికులకు అంతరాయం లేకుండా ఇతర రవాణా మార్గాలతో మల్టీమోడల్ కనెక్టివిటీ అందించనుందని. దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

6 / 12
దక్షిణ మధ్య రైల్వే హై స్పీడ్ రైలు బుకింగ్ సేవలు జనవరి 14 శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రయాణీకులు ఆన్‌లైన్‌లో లేదా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) సందర్శించడం ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ రైలుతో సమయం ఆదా అవ్వడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది.

దక్షిణ మధ్య రైల్వే హై స్పీడ్ రైలు బుకింగ్ సేవలు జనవరి 14 శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రయాణీకులు ఆన్‌లైన్‌లో లేదా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) సందర్శించడం ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ రైలుతో సమయం ఆదా అవ్వడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది.

7 / 12
ప్రయాణికులకు కేటరింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో రెండు రకాలుగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. అయితే, క్యాటరింగ్ సదుపాయం వద్దనుకుంటే ఈ ఛార్జీలను మినహాయిస్తారు.

ప్రయాణికులకు కేటరింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో రెండు రకాలుగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. అయితే, క్యాటరింగ్ సదుపాయం వద్దనుకుంటే ఈ ఛార్జీలను మినహాయిస్తారు.

8 / 12
ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం ఈ రైలు ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది.

ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం ఈ రైలు ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది.

9 / 12
ఆ తర్వాత చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.

ఆ తర్వాత చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.

10 / 12
కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే ఈ స్టేషన్‌లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. 16వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ సెమీ హైస్పీడ్ రైలు సేవలందించనుంది.

కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే ఈ స్టేషన్‌లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. 16వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ సెమీ హైస్పీడ్ రైలు సేవలందించనుంది.

11 / 12
ఈ రైలుతో సమయం ఆదా అవ్వడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది.

ఈ రైలుతో సమయం ఆదా అవ్వడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది.

12 / 12
Follow us