Venkata Narayana |
Updated on: Oct 24, 2021 | 1:30 PM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం నుండి ఈ రోజు తెలంగాణలో వైయస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్ర ప్రారంభం. షర్మిల పాదయాత్ర దాదాపు 400 రోజులు.. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర. 14 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కొనసాగనుంది.
పాదయాత్రలో షర్మిలకు బ్రహ్మరథం పడుతోన్న జనం. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగుతోన్న పాదయాత్ర
తన పర్యటనలో టీఆర్ఎస్ సర్కారుపై ఘాటు విమర్శలు గుప్పిస్తోన్న షర్మిల. 9 ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోజూ సాయంత్రం పలు సమస్యల పరిష్కారంపై షర్మిల స్థానిక నాయకులు, ప్రజలతో షర్మిల భేటీలు
పాదయాత్రలో షర్మిలను కలిసి సంఘీభావం ప్రకటించిన వైవీ సుబ్బారెడ్డి
షర్మిలకు ఆప్యాయంగా చేతులిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తోన్న తెలంగాణ మహిళలు. పాదయాత్రలో భాగంగా రోజూ రచ్చబండ తరహాలో ప్రజలతో మాటముచ్చట కార్యక్రమం సాగిస్తోన్న షర్మిల