G20 Gala Dinner Photos: సందడిగా సాగిన జి 20 గాలా డిన్నర్.. ఫోటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి జీ20 దేశాధినేతలకు డిన్నర్ ఇచ్చారు. ఈ విందుకు వచ్చే వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దగ్గరుండి స్వాగతం చెప్పారు. విదేశీ అతిథులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ విందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటు ఇతర నేతలు కూడా హాజరయ్యారు. డిన్న డయాస్ వెనక గోడపై బీహార్ లోని ప్రాచీన నలందా యూనివర్శిటీని చూపించారు. అలాగే వసుధైక కుటుంబం, ఒకటే భూమి, ఒకటే కుటుంబం, ఒకటే భవిష్యత్తు థీమ్ చూపించారు.
Most Read Stories