CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ప్రజాదర్భార్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం..
ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలతో మమేకం అవుతూ ప్రజా ప్రయోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్ పేరుతో ప్రజలను కలుసుకుంటున్నారు. వారి సమస్యలను అర్జీల రూపంలో సీఎం చంద్రబాబుకు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తన నివాసానికి చేరుకుంటున్నారు బాధితులు. సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటిన తొలిరోజే ఐదు హామీలపై సంతకాలు చేశారు. వాటిని అమలు చేసేందుకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక పాలన గాడిలో పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సిద్దమయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
