అహోబిలంలో నరసింహ స్వామి అవతారంలో ఉగ్రరూరంలో హిరణ్యకశిపుని చంపిన తరువాత తన ఉగిర రూపాన్ని చల్లర్చడానికి దేవకలంతా కలిసి వెయ్యి నూతులలో నీటితో ఆయనకు అభిషేకం చేస్తే కానీ ఆ రూరం చల్లబడలేదంట.. ఆ వెయ్యు నూతులు ఎక్కడో ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
కడప జిల్లా లోని కమలాపురం నియోజకవర్గం పెండ్లి మర్రి ప్రాంతంలోని వెయ్యి నూతుల కోన ప్రాంతానికి ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. నరసింహా స్వామి వారు హిరణ్యకశిపుడిని వధించి కొండప్రాంతం అయిన ఈ క్షేత్రానికి రావడం జరిగిందని చెబుతారు. అప్పుడు దేవతలంతా స్వామి వారి ఉగ్ర రూపాన్ని చల్లబరచాలంటే ఏం చేయాలో అర్థం కాలేదట. చివరకు కొండ పరిసర ప్రాంతంలో వెయ్యి బావులను సృష్టించారట.
అనంతరం ఆ బావులలోని నీటిని తీసుకువచ్చి స్వామివారి మీద పోస్తూ అభిషేకించారంట. ఆ తరువాత గాని ఉగ్రరూపుడైన నరసింహస్వామి చల్లబడలేదని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి . అంతేకాక ఆయన అక్కడ స్వయంభువుగా వెలిశారని భక్తుల విశ్వాసం.
స్వామి వారు కృతయుగములో ఉద్భవించడం జరిగిందని వేదపురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం అటవీ ప్రాంతంలో ఉంటుంది. అనేకమంది భక్తులు ఇక్కడకు వచ్చి నరసింహస్వామికి మొక్కులను చెల్లించుకుంటారు.
ఇక్కడి నరసింహ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న పనులు వెంటనే అవుతాయని, ఈ దేవాలయం కు వచ్చి దర్శించుకుని వెళితే ఏ పనైనా ఎదురులేకుండా అవుతుందనేది ఇక్కడి భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఇక్కడ శాంతింపబడి ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి ఈ దేవాలయమును దర్శించుకోవడం వల్ల చాలా మనశ్శాంతి కూడా ఉంటుందని భక్తుల నమ్మకం..