
హైదరాబాద్ నుంచి షిర్డీకి ఐఆర్సీటీసీ కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది. సాయి భక్తుల కోసం సాయి శివం పేరుతో టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా నాసిక్ త్రయంబకేశ్వర్, షిరిడి ఆలయం, పంచవటి వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించవచ్చు.

IRCTC నాసిక్ కు ఏర్పాటు చేసిన కొత్త టూర్ ప్యాకేజీలో భాగంగా.. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఇందులో 3 రాత్రులు 4 రోజులు కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ఈ ట్రిప్ లో భాగంగా నాసిక్, షిర్డీతో పాటు పలు ప్రాంతాలను చూస్తారు.

జూన్ 2, 2023వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. 4వేల ధరలో కూడా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ద్వారా టూర్ ను బుక్ చేసుకోవావాలి.

సాయి శివం టూర్లో మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 06:50 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రైలు నంబర్ 17064 (అజంతా ఎక్స్ ప్రెస్) రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది. ఆ మర్నాడు ఉదయం 07:10 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ మిమ్మల్ని ఐఆర్ సిటీసీ వాహనంలో మిమ్మల్నీ షిరిడీకి తీసుకెళ్తారు.

రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాలి.

మూడో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత షిరిడీ హోటల్ నుంచి చెక్ ఔట్ అవుతారు. అక్కడ నుంచి నాసిక్ లోని త్రయంబకేశ్వర్ కు వెళతారు. అనంతరం పంచవటి దర్శనం, ఆ తర్వాత నాగర్ సోల్ స్టేషన్ లో రాత్రి 8:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు రైలు బయలుదేరుతుంది.

నాల్గవ రోజు: నాల్గవ రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్, కంఫర్ట్ క్లాస్ అనే ఆప్షన్స్ ఉంటాయి.

ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణ చార్జీలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఉదయం రెండు రోజుల పాటు బ్రేక్ఫాస్ట్ కవర్ అవుతాయి. ప్యాకేజీలో లేనివి.. రైళ్లో భోజన ఖర్చులు, మధ్యాహ్నం భోజనం, దర్శనీయ ప్రదేశాల వద్ద టికెట్ చార్జీలు, గైడ్ తదితర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.