Israeli Tourist: భారత దేశంలో ఈ ప్రదేశాలను ఇజ్రాయిలీలు ఎక్కువగా పర్యటించడానికి ఇష్టపడతారు.. ఎందుకో తెలుసా..
పర్వతాలు, నదులు, జలపాతాలు, ఎడారులు, అనేక అందమైన ప్రకృతి దృశ్యాలతో భారత దేశం అత్యంత అందంగా ఉంటుంది. మన దేశంలో సందర్శించడానికి అనేక ఉత్తమ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను చూసేందుకు భారతీయులే కాకుండా విదేశీ పౌరులు కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అనేక దేశాల నుంచి మన దేశంలోని అందాలను, చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రజలకు భారత దేశం అన్నా.. మన దేశాన్ని పర్యటించాలన్నా ఇష్టపడతారు.
Updated on: Oct 12, 2023 | 11:36 AM

ఇజ్రాయిల్ పర్యాటకులు సందర్శించడానికి ఇష్టపడే కొన్ని ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ ప్రదేశాల అందం సంస్కృతి ప్రయాణికులను ఆకర్షిస్తుంది. ఇజ్రాయిల్ పర్యాటకులు సందర్శించడానికి ఇష్టపడే భారతదేశంలోని ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

కసోల్, హిమాచల్ : ఇజ్రాయిల్ పర్యాటకులు భారతదేశంలోని పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. ప్రకృతి అందాలతో చుట్టుముట్టబడిన కసోల్లో యూదుల సంస్కృతిని చూడగలిగే అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇజ్రాయిలీ ఫుడ్ షక్షౌక కూడా ఇక్కడి రెస్టారెంట్లలో వడ్డిస్తారు.

పుష్కర్, రాజస్థాన్ : చాబాద్ హౌస్ ఆఫ్ పుష్కర్లో ఎక్కువ మంది షాప్ ఓనర్స్ ఇజ్రాయిల్ భాష హర్బును మాట్లాడతారు. పుష్కర్ కు వచ్చిన తర్వాత ఇజ్రాయిల్ పర్యాటకులు స్థానికుల ఇంట్లోనే విడిది చేస్తారు. వీరికి రాజస్థానీ సంస్కృతి అంటే చాలా ఇష్టం.

ధరమ్కోట్, కాంగ్రా : హిమాచల్లోని ధరమ్కోట్ ఇజ్రాయిల్ పర్యాటకులకు ఇష్టమైన భారతీయ పర్యాటక ప్రదేశం అని నమ్మకం. పర్వతాలతో చుట్టుముట్టబడిన ధరమ్కోట్లో ప్రతి సంవత్సరం యూదుల నూతన సంవత్సరాన్ని రోష్ హషానా వరకు జరుపుకుంటారు.

మలానా, హిమాచల్ : హిమాచల్ ప్రదేశ్ హిల్ స్టేషన్లను విదేశీ పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు. హిమాచల్లోని మలానా సంస్కృతి ఇజ్రాయిలీలను ఆకర్షిస్తుంది. మలానా అందాలే కాదు.. ఇక్కడి ఆహారం కూడా ఇజ్రాయెల్ పర్యాటకులకు చాలా ఇష్టం.





























