
కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాములు మటన్, 3 కోడి గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ మసాలా పొడి, కారం, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకోవాలి.

మెత్తని మటన్ ను తీసుకుని వేడి నీళ్లలో కడిగి డానికి కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు పట్టించి పక్కన గిన్నెలో ఉడకబెట్టి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో కోడి గుడ్లను బ్రేక్ చేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముక్కలు, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ కారం బాగా కలుపుకోవాలి

ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా ఉడకబెట్టిన మటన్ ముక్కలను వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడయ్యే వరకు ఉంచి గుడ్డు మిశ్రమాన్ని పెనం మీద పోసి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాలనివ్వాలి. అంతే, వేడి వేడి మటన్ ఆమ్లెట్ రెడీ.