
కావాల్సిన పదార్ధాలు : కుండ ఒకటి, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా చికెన్ను తీసుకుని శుభ్రంగా కడిగి డానికి అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, మసాలా పొడులు వేసి 2 గంటల పాటు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి.

కుండ కొత్తది అయితే రుచికరంగా ఉంటుంది. అయితే, దానిలో ముందుగా నూనె వేసి శుభ్రం చేసి వాడాలి.

ఇక ఇప్పుడు కుండలో నూనె వేసి, ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు వేసి బాగా వేయించాలి. కొద్దీ సేపు ఆగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి, దానికి ఒక మూత లాగి పెట్టి బాగా ఉడికించాలి.

మట్టి కుండలో ఏ కూర అయినా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మట్టి వాసన వస్తుంది అలాగే మంచి రుచిని కూడా ఇస్తుంది. ఈ కుండ చికెన్ను సాధారణంగా అన్నంతో కానీ రోటీలతో కానీ రుచిగా ఉంటుంది.