
ఎండు మిర్చి పల్లీల చట్నీని పల్లెటూర్లలో బాగా చేసుకుని తింటారు. ఈ పచ్చడిని చాలా మంది ఉప్మా, ఇడ్లీల్లోకి తింటారు. ఇంకా వీటిలో పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, చింతపండును కూడా ఈ పల్లీల పచ్చడిలో వేస్తే రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాముల పల్లీలు, కొబ్బరి , 50 గ్రాముల ఎండు మిర్చి, అల్లం, 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు పప్పు, పసుపు, నిమ్మకాయంత చింతపండు, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

మిక్సీ లో కానీ, రోటిలో కానీ వేయించిన పల్లీలు ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్రను వేసి బాగా దంచుకోవాలి. ఆ తర్వాత తరిగిన అల్లం, శనగపప్పు , చింతపండు, రుచికి తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి వాటిని బాగా పట్టుకోవాలి.

స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఆకులు , పచ్చి మిర్చి ముక్కలు, ఎండుమిర్చిని కూడా వేసి వాటిని బాగా వేయించాలి. ఈ పోపును ఎండు మిర్చి పచ్చడి మిశ్రమంలో వేసి గరిటేతో వాటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

ఎండు మిర్చి పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే దానిలో వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే తినడానికి టేస్టీగా ఉంటుంది. చట్నీ చిక్కగా రావాలంటే కొద్దిగా నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఒక దోసె, ఒక ఇడ్లీ తినే వాళ్ళు రెండు ప్లేట్స్ లాగిస్తారు.