- Telugu News Photo Gallery How To Improve Digestion: 3 Things You Should Never Do After Meals As Per Nutritionist
Digestion System: అందుకే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు.. ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?
కొంచం తిన్నా పొట్ట నిండిపోతుందా? గొంతు-ఛాతీలో ఇబ్బందిగా ఉంటోందా? అయితే మీకు అసిడిటీ ఉన్నట్లే. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీని వల్ల ఎసిడిటీ ఏర్పడి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. నేటి కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ జీర్ణ సంబంధిత రుగ్మతలు వెంటాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు..
Updated on: Apr 11, 2024 | 9:31 PM

కొంచం తిన్నా పొట్ట నిండిపోతుందా? గొంతు-ఛాతీలో ఇబ్బందిగా ఉంటోందా? అయితే మీకు అసిడిటీ ఉన్నట్లే. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీని వల్ల ఎసిడిటీ ఏర్పడి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. నేటి కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ జీర్ణ సంబంధిత రుగ్మతలు వెంటాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. ఫలితంగా గ్యాస్ట్రిక్, అల్సర్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి.

పొట్ట ఆరోగ్యంగా లేకుంటే శరీరం ఫిట్గా ఉండదు. ఆహారపు అలవాట్లను సరిదిద్దడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియను సరైన దారిలో పెట్టవచ్చు. అలాగే కొన్ని అలవాట్లను కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా తిన్న తర్వాత మనం చేసే కొన్ని సాధారణ తప్పులు పెద్ద సమస్యలకు కారణం అవుతాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందులో ఒకటి తిన్న తర్వాత పడుకోవడం. తిన్న తర్వాత పడుకోవడం లేదా పడుకుని తినడం వల్ల ఆహారం మళ్లీ అన్నవాహికలోకి వెళ్లిపోతుంది. ఫలితంగా జీర్ణక్రియ జరగదు. ఇది ఎసిడిటీ, అపానవాయువు సమస్యలను కలిగిస్తుంది.

చాలామంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు. ఈ అలవాటు జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. తిన్న తర్వాత స్నానం చేయడం వల్ల శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. కడుపులో రక్త ప్రసరణ నెమ్మదిగా జరగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగదు.

ఆహారం తినేటప్పుడు నీరు త్రాగడం చాలా మందికి అలవాటు. ఇది వెంటనే మానుకోవాలి. ఆహారంలో నీరు తాగడం వల్ల కడుపులో ఆమ్లం నీళ్లతో కలిసిపోయి.. కడుపులోని ఆమ్లాన్ని పలుచన చేస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ ప్రక్రియ దెబ్బతింటుంది. అందుకే తిన్న 20-30 నిమిషాల తర్వాత నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు

గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి సమస్యలు కూడా చాలా వరకు ఆహారంపై ఆధారపడి ఉంటాయి. స్పైసీ, పాత ఆహారాలకు బదులుగా ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను తినాలి. అలాగే నీరు పుష్కలంగా త్రాగాలి. అప్పుడు జీర్ణక్రియ సక్రమంగా జరిగి ఉదర సమస్యలు తగ్గుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కడుపు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేయాలి. ఫలితంగా జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. ఇన్ని నియమాలు పాటించిన తర్వాత కూడా డైజెస్టివ్ డిజార్డర్ ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.




