
కరివేపాకు తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలని నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది. కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల డీటాక్సీఫైయర్లా పనిచేస్తుంది. కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

కరివేపాకు నమలడం వల్ల ఇది ఆమ్లతను తగ్గించడం, జీర్ణ ఎంజైమ్లను పెంచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం చికిత్సకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు.. కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కరివేపాకు నమలడం వల్ల దుర్వాసన దూరం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగితే.. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సీజనల్ వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయి.

ఉదయాన్నే కరివేపాకులు నమలడం వల్ల శరీరంలో పేరుకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది. జీర్ణ సమస్యలు దూరమై జీవక్రియ అనేది మెరుగు పడుతుంది. దీంతో వెయిట్ లాస్ అవుతారు. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. కాలేయం, మూత్ర పిండాలు కూడా ఆరోగ్యంగా పని చేస్తాయి.

కరివేపాకు తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఉదయాన్నే కరివేపాకు నమిలి తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)