
ఈ పాయసం తింటే మీ శక్తి డబుల్ అవుతుంది. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది తింటే, మీ ఎముకలు కూడా బలంగా మారతాయి. ఇవి తింటే కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. అధిక బరువు ఉన్న వారికీ కూడా ఇది మంచి ఫుడ్. కొంచం తిన్నా చాలు ఆకలి వేయకుండా చేస్తుంది.

రాగి పిండి పాయసానికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల రాగి పిండి, 150 గ్రాముల కప్పు బెల్లం , ఇంకా నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక కప్పు పాలు, రెండు కప్పుల నీరు, అర టీ స్పూన్ యాలకుల పొడి, 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 5 కిస్మిస్ లు, రెండు టీ స్పూన్స్ కొబ్బరిని కూడా తీసుకోవాలి.

రాగి పాయసం తయారి విధానం : ఒక గిన్నెను తీసుకుని దానిని బాగా కడిగి దీనిలో ఈ రాగి పిండిని తీసుకోవాలి. ఆ తరవాత దీనిని తీసుకుని వేడి నీళ్లలో మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఆ తరవాత దీనిని తీసుకుని పక్కన బెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టిన తరువాత ఉండలు లేకుండా ప్రతి రెండు నిముషాలకొకసారి దీనిని తిప్పుతూ ఉండాలి అప్పుడు అది పలుచగా అవుతుంది.

ఈ బెల్లం పాకాన్ని తీసుకుని దానిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి, రాగి పిండిలో కలిసిపోయే వరకు దీనిని కలుపుతూ ఉండాలి. ఇంకా ఈ ఇది కూడా ఉండలుగా లేకుండా 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు పాలు పోసి ఇంకో 10 నిమిషాల పాటు మీడియం మంటపై బాగా ఉడికించాలి. ఇంకా దీనిలో అర టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కొబ్బరి కూడా వేసి బాగా కలపాలి.

రాగి పాయసం తయారి విధానం స్టెప్ 3 : గ్యాస్ పొయ్యి మీద పాన్ పెట్టి దీనిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం వేయించి ఈ రాగిపిండిలో దీనిని కలపాలి. ఇంకా దీనిని వేడి వేడిగా తింటే టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఇంకా పెంచడం కోసం నాలుగు కిస్ మిస్ లు , పిస్తా పప్పులు వేస్తె టేస్ట్ డబుల్ అవుతుంది.