మొక్కల్ని పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. ఇప్పుడు ఇంట్లో సౌకర్యంగా పెట్టుకునేందుకు ఇండోర్ ప్లాంట్స్ కూడా వచ్చాయి. వీటి ఖరీదు ఎక్కువగా ఉన్నా కూడా చాలా మంది వీటిని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈ ఇండోర్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఇంటికి అందం కూడా వస్తుంది. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆక్సిజన్ను విడుదల చేసే ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల గాలి కలుషితం కాకుండా ఉంటుంది.
అయితే కొన్ని రకాల ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో దుమ్ము కూడా తగ్గుతుందట. సాధారణంగా ఇంట్లో దుమ్ము, ధూళి రావడం కామన్. కానీ ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల దుమ్ము లేకుండా చేస్తాయట.
రబ్బరు మొక్క, ఐవీవై ప్లాంట్, ఈత చెట్టు, శాంతి లిల్లీ ప్లాంట్, వెదురు మొక్క, స్నేక్ ప్లాంట్ వంటి వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల దుమ్ము అనేది చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి గాలిలో ఉండే హానికరమైన టాక్సిన్స్ను కూడా తొలగిస్తాయి.
వీటిని ఇంట్లో పెట్టుకుంటే గాలి కలుషితం కాకుండా ఉంటుంది. ఈ మొక్కలు.. ఎయిర్ ఫ్యూరిఫైయర్గా పని చేస్తాయి. దుమ్ము, ధూళిని బయటకు పంపించి.. గాలిని శుద్ధి చేస్తాయి.