H3N2 Virus: హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. పది రోజులు పాఠశాలలకు సెలవు.

|

Mar 16, 2023 | 12:50 PM

హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌కు చిన్నారులు ఎక్కువగా బాధితులుగా మారే అవకాశాలు ఉన్న కారణంగా పది రోజుల పాటు పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు..

1 / 5
 ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి భయాలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించేలోపే మరో కొత్త వైరస్‌ భయపెడుతోంది. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ పంజా విసురుతోంది.

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి భయాలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించేలోపే మరో కొత్త వైరస్‌ భయపెడుతోంది. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ పంజా విసురుతోంది.

2 / 5
రోజురోజుకీ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా ఇద్దరు మరణించడంతో ప్రభుత్వాలు సైతం అలర్ట్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పుదుచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

రోజురోజుకీ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా ఇద్దరు మరణించడంతో ప్రభుత్వాలు సైతం అలర్ట్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పుదుచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

3 / 5
అక్కడ వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతుడడంతో పది రోజులపాటు పాఠశాలకు సెలవులు ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అక్కడ వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతుడడంతో పది రోజులపాటు పాఠశాలకు సెలవులు ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

4 / 5
 మార్చి 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫ్లూయెంజా ఏ వైరస్ వల్ల పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పుదుచ్చేరి, కరైకల్, మహే, యానాం ప్రాంతాల్లో అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యా శాఖ మంత్రి ఏ నమశ్శివాయం ఉత్తర్వులు జారీ చేశారు.

మార్చి 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫ్లూయెంజా ఏ వైరస్ వల్ల పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పుదుచ్చేరి, కరైకల్, మహే, యానాం ప్రాంతాల్లో అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యా శాఖ మంత్రి ఏ నమశ్శివాయం ఉత్తర్వులు జారీ చేశారు.

5 / 5
H3N2 Virus: హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. పది రోజులు పాఠశాలలకు సెలవు.