AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: మిస్టర్ కూల్ రికార్డును సమం చేసిన హిట్‌మ్యాన్.. చరిత్ర లిఖించేందుకు మరో అడుగు దూరంలో..

Rohit Sharma Records: ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ కొత్త చరిత్రను లిఖించే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. భారత టీ20 జట్టుకు రోహిత్ శర్మ విజయవంతమైన కెప్టెన్‌గా అవతరిస్తాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తరపున యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబే (63) అర్ధ సెంచరీలతో రాణించారు.

Venkata Chari
|

Updated on: Jan 15, 2024 | 9:52 AM

Share
అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక రికార్డును లిఖించాడు. భారత జట్టు ఇప్పటివరకు చూడని విజయవంతమైన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేయడం కూడా విశేషమే.

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక రికార్డును లిఖించాడు. భారత జట్టు ఇప్పటివరకు చూడని విజయవంతమైన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేయడం కూడా విశేషమే.

1 / 6
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తరపున యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబే (63) అర్ధ సెంచరీలతో రాణించారు. ఫలితంగా అఫ్గానిస్థాన్ 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తరపున యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబే (63) అర్ధ సెంచరీలతో రాణించారు. ఫలితంగా అఫ్గానిస్థాన్ 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2 / 6
ఈ విజయంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు భారత జట్టును విజయవంతంగా నడిపించిన మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. క్రికెట్‌లో 72 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన ధోనీ, భారత జట్టుకు 41 విజయాలు అందించాడు.

ఈ విజయంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు భారత జట్టును విజయవంతంగా నడిపించిన మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. క్రికెట్‌లో 72 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన ధోనీ, భారత జట్టుకు 41 విజయాలు అందించాడు.

3 / 6
ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌పై విజయంతో, రోహిత్ శర్మ కూడా భారత జట్టును 41 సార్లు విజయపథంలో నడిపించాడు. అది కూడా 53 మ్యాచ్‌ల ద్వారా మాత్రమే. అంటే హిట్‌మ్యాన్ నేతృత్వంలో 53 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు ఈసారి 41 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌పై విజయంతో, రోహిత్ శర్మ కూడా భారత జట్టును 41 సార్లు విజయపథంలో నడిపించాడు. అది కూడా 53 మ్యాచ్‌ల ద్వారా మాత్రమే. అంటే హిట్‌మ్యాన్ నేతృత్వంలో 53 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు ఈసారి 41 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

4 / 6
విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 50 టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొంది. ఈక్రమంలో భారత జట్టు 30 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే హార్దిక్ పాండ్యా సారథ్యంలో 16 మ్యాచ్‌ల్లో పాల్గొన్న భారత జట్టు కేవలం 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 50 టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొంది. ఈక్రమంలో భారత జట్టు 30 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే హార్దిక్ పాండ్యా సారథ్యంలో 16 మ్యాచ్‌ల్లో పాల్గొన్న భారత జట్టు కేవలం 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

5 / 6
ప్రస్తుతం 41 విజయాలతో ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ సరికొత్త చరిత్రను లిఖించే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. భారత టీ20 జట్టుకు రోహిత్ శర్మ విజయవంతమైన కెప్టెన్‌గా అవతరిస్తాడు.

ప్రస్తుతం 41 విజయాలతో ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ సరికొత్త చరిత్రను లిఖించే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. భారత టీ20 జట్టుకు రోహిత్ శర్మ విజయవంతమైన కెప్టెన్‌గా అవతరిస్తాడు.

6 / 6