IPL 2025: ఆర్సీబీ రిటైన్ లిస్ట్ ఇదే.. డేంజరస్ ప్లేయర్కు హ్యాండిచ్చారుగా?
IPL 2025: ఐపీఎల్ మెగా వేలం నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. ఆరుగురు ఆటగాళ్లను జట్టులో ఉంచుకుంటే మొత్తం రూ.79 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Updated on: Oct 19, 2024 | 10:37 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీబి) ఫ్రాంచైజీ స్టార్ ప్లేయర్లను ఉంచుకోవడం ఖాయమైంది. ఈ జాబితాలో ఇప్పుడు ముగ్గురు ఆటగాళ్ల పేర్లు కనిపించాయి. రాబోయే సీజన్లో కూడా RCB తరపున ఆడటం ఖాయం అని తెలుస్తోంది.

పీటీఐ నివేదిక ప్రకారం, విరాట్ కోహ్లీని రిటైన్ చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మొదటి ఎంపిక. గత 17 సీజన్లలో ఆర్సీబీ తరపున ఆడిన కోహ్లి.. ఈసారి భారీ మొత్తం చెల్లించి జట్టులో ఉంచుకోవచ్చు.

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండో రిటైనర్గా కనిపించనున్నాడు. డుప్లెసిస్ను ఆర్సీబీ విడుదల చేస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ, కరీబియన్ ప్రీమియర్ లీగ్లో అతని అద్భుతమైన ప్రదర్శన, సెయింట్ లూసియా కింగ్స్ను ఛాంపియన్గా చేసినందున ఫాఫ్ను తదుపరి సీజన్లో జట్టులో ఉంచాలని RCB నిర్ణయించినట్లు PTI పేర్కొంది.

అదేవిధంగా ఆర్సీబీ జట్టులో మూడో రిటైనర్గా మహ్మద్ సిరాజ్ ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టు బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న సిరాజ్ను మెగా వేలానికి ముందే జట్టులో కొనసాగించాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్ణయించింది.

గత సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ను ఆర్సీబీ విడుదల చేయడం దాదాపు ఖాయం. కాబట్టి వచ్చే సీజన్లో ఆర్సీబీ జట్టులో మ్యాక్సీ కనిపించక చెప్పొచ్చు అని తెలుస్తోంది.




