
రేపటి నుంచి (ఫిబ్రవరి 15) భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 3వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఇరుజట్లు సమయంగా నిలిచాయి. అంటే, సిరీస్లో ఇరుజట్లు చెరే మ్యాచ్ గెలిచి, సత్తా చాలాయి. రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ గ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.

అంటే టెస్టు క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన రికార్డును నెలకొల్పేందుకు ఇంగ్లండ్పై భారత్ మరో విజయం సాధిస్తే సరిపోతుంది. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై 32 మ్యాచ్లు గెలిచి, దూసుకపోతోంది.

భారత్, ఇంగ్లండ్లు టెస్టు క్రికెట్లో మొత్తం 133 మ్యాచ్లు ఆడాయి. ఇందులో 51 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా, 32 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది.

అలాగే ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు 107 టెస్టు మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా 45 మ్యాచుల్లో గెలుపొందగా, టీమిండియా 32 మ్యాచుల్లో విజయం సాధించింది.

అంటే టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లపై భారత జట్టు 32 సార్లు విజయం సాధించింది. ఇప్పుడు రాజ్కోట్లో టీమిండియా గెలిస్తే.. టెస్టులో ఓ జట్టుపై 33 మ్యాచ్లు గెలిచిన భారత జట్టు ప్రత్యేక రికార్డు సృష్టించనుంది.

అందువల్ల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగే 3వ టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ జట్టు నుంచి అద్భుతమైన ప్రదర్శనను ఆశించవచ్చు. అలాగే, ఈ విజయంతో డబ్యూటీసీ పాయింట్ల పట్టికలోనూ టీమిండియా సత్తా చాటనుంది.

ఇంగ్లండ్ టెస్టు జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ అండర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, షోయబ్ బషీర్, డాన్ లారెన్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యస్సవి జైస్వాల్, శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్జా, రవీంద్ర జడేజా *, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.