
Jay Shah Could be New ICC Chairman: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. నివేదికల ప్రకారం, PCB తన షెడ్యూల్ను కూడా సిద్ధం చేసింది. అధికారిక ప్రకటన మాత్రమే ఇంకా వెలువడాల్సి ఉంది. దీనికి ముందు పాకిస్థాన్కు షాకిచ్చేలా ఓ పెద్ద వార్త బయటకు వస్తోంది. నిజానికి, BCCI సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICC తదుపరి ఛైర్మన్ కావచ్చు అనే చర్చ జరుగుతోంది.

ఈ ఏడాది నవంబర్లో ఐసీసీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. నివేదికల ప్రకారం, జై షా ఈ పదవికి పోటీ చేయాలని యోచిస్తున్నాడు. ఈ కారణంగా అతను బీసీసీఐ కార్యదర్శి పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. ప్రస్తుతం న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే ఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అతను జై షా మద్దతుతో మాత్రమే అధ్యక్షుడయ్యాడు. జై షా ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థిత్వం నుంచి కూడా వైదొలగవచ్చు. ఈ నెలలో కొలంబోలో ఐసీసీ సమావేశం జరగనుంది. జై షా ఐసీసీ ఛైర్మన్గా ఉండాలనుకుంటున్నారా లేదా అనే విషయంపై అప్పుడే స్పష్టత వస్తుంది.

ఒకవేళ జై షా ఐసీసీ చైర్మన్ అయితే పాకిస్థాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్లో జరగనుంది. భారత్ తమ దేశానికి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడాలని పాకిస్థాన్ కోరుతోంది. అలాగే టీమిండియా మ్యాచ్ల షెడ్యూల్ను కూడా పీసీబీ విడుదల చేసింది. గత కొన్నేళ్లుగా భారత్ పాకిస్థాన్ను సందర్శించలేదు. ఈ కారణంగానే ఈసారి కూడా టీమిండియా పాకిస్థాన్లో పర్యటించే అవకాశాలు చాలా తక్కువ.

ఒకవేళ జైషా ఐసీసీ ఛైర్మన్ అయితే, పాకిస్తాన్ చేసే అన్ని ప్రయత్నాలకు గండి పడినట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే జైషాకు కూడా భారత జట్టును పాక్ పంపడం ఇష్టంలేదు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీగా లాస్ రానుంది. ఈ క్రమంలో మరెన్ని ట్విస్టులు ఉంటాయో రానున్న రోజుల్లో తెలుస్తుంది.

టీమిండియా పాకిస్తాన్లో పర్యటించకపోతే, పీసీబీ ఐసీసీకి అప్పీల్ చేస్తుంది. అయితే జే షా ఐసీసీ ఛైర్మన్గా ఉంటే, ఈ విషయంలో భారత్కు ప్రయోజనం చేకూరుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్థాన్కు వెళ్లదని, ఐసీసీ నుంచి ప్రత్యేక డిమాండ్లు చేయనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. భారత మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరనుంది. అంటే, ఆసియా కప్లో శ్రీలంకలో భారత్ మ్యాచ్లు నిర్వహించినట్లు, ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా అలాంటిదే జరిగిన సంగతి తెలిసిందే.