IPL 2021 Points Table: ఐపీఎల్ 2021 సెకండ్ ఎడిషన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. జట్ల మధ్య పోటీ చివరి అంకానికి చేరుకుంటుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ల తర్వాత పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన ఈ జట్టు ఎనిమిది విజయాలను అందుకొని 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.
ఇక 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 8 విజయాలను సొంతం చేసుకొని 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
రాయల్ చాలెంజ్ బెంగళూరు 11 మ్యాచ్లకు గాను 7 గెలిచి.. 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
కోల్కతా 11 మ్యాచ్లకు గాను 5 గెలిచి నాలుగో స్థానంలో ఉంది. ముంబయి 11 మ్యాచ్లకు 5 గెలిచి ఐదో స్థానలో ఉంది.
11 మ్యాచ్లు ఆడి 4 విజయాలు సొంతం చేసుకున్న పంజాబ్ 6వ స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్లు ఆడి 4 విజయాలను సొంతం చేసుకొని 7వ స్థానంలో నిలిచింది. 10 మ్యాచ్లు ఆడి 2 విజయాలను సొంతం చేసుకొన్న సన్రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
ఇక సీజన్లో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన వారికి ఇచ్చే ఆరంజ్, పర్పుల్ క్యాప్ విభాగంలో.. ప్రస్తుతం 454 పరుగులతో ఢిల్లీ ప్లేయర్ శిఖర్ ధావన్ ఆరంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. 26 వికెట్లతో బెంగళూరు జట్టుకు చెందిన హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు.