ఐపీఎల్ 14వ సీజన్ను లక్నో సూపర్ జెయింట్ ఓటమితో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో లక్నో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. శనివారం (మార్చి 30న) సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ కు ముందే లక్నోకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
ఇంగ్లండ్ ఆల్రౌండర్ డేవిడ్ వీలీ లక్నో జట్టును వీడాడు. అతనిని రూ. 2కోట్లకు కొనుగోలు చేసింది లక్నో ఫ్రాంఛైజీ. అయితే ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో డేవిడ్ స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో వీలీ స్థానంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీని చేర్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించింది ఐపీఎల్.
లక్నో మాట్ హెన్రీని రూ. 1.25 కోట్లప్రాథమిక ధరకు తీసుకుంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో పాల్గొనడం మాట్ హెన్రీకి ఇదే తొలిసారి కాదు. మాట్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు లక్నో అతని మూడవ జట్టుగా మారింది. ఇక మ్యాచ్ల విషయానికి వస్తే..
ఇవాళ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది లక్నో టీమ్. అటల్ బిహారి వాజ్ పేయి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది లక్నో టీమ్.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), అమిత్ మిశ్రా, ఆయుష్ బడోని, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, నికోలస్ పూర్ణన్, నికోలస్ పూరన్ క్వింటన్ డి కాక్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, శివమ్ మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్ విల్లీ, అష్టన్ టర్నర్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, షమర్ జోసెఫ్