uppula Raju |
Updated on: Apr 11, 2022 | 6:49 AM
రవిచంద్రన్ అశ్విన్ బంతితో పాటు బ్యాట్తో కూడా మ్యాజిక్ చేస్తాడు. రాజస్థాన్ రాయల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ తర్వాత అశ్విన్తో కలిసి షిమ్రోన్ హెట్మెయర్ ఇన్నింగ్స్ను హ్యాండిల్ చేశాడు. అశ్విన్ ఆరో నెంబర్లో బ్యాటింగ్కి వచ్చాడు.
ఈ మ్యాచ్లో అశ్విన్ వేగంగా పరుగులు చేశాడు. అయితే చివరి 10 బంతులు మిగిలి ఉండగా అతను షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఔట్ అవ్వకుండానే పెవిలియన్ చేరాడు. రియాన్ పరాగ్కి అవకాశం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్ 23 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేశాడు.
అశ్విన్ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ 4 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 8 పరుగులు చేశాడు. ఈ సమయంలో హెట్మెయర్ జట్టును 165 పరుగుల వద్దకు తీసుకెళ్లాడు. అయితే అశ్విన్ ఇలా చేయడం ఐపీఎల్లో మొదటిసారి.