IPL 2025: వచ్చే ఏడాది మారనున్న అన్ని జట్ల రూపురేఖలు.. ఐపీఎల్ 2025లో రిటైన్ చేసేది కేవలం నలుగురినే.. ఎందుకో తెలుసా?

Updated on: Mar 11, 2024 | 3:39 PM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 మార్చి 22 నుంచి ప్రారంభమవుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆర్‌సీబీ, సీఎస్‌కే జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. IPL 2024 ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 ప్రారంభం కావడానికి ముందు IPL 2025కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. IPL 2025 కోసం మెగా ప్లేయర్ వేలం ఉంటుందని IPL అధ్యక్షుడు అరుణ్ ధుమాల్ ధృవీకరించారు. కాబట్టి, వచ్చే ఏడాది అన్ని జట్లూ మారడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

1 / 6
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 ప్రారంభం కావడానికి ముందు IPL 2025కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. IPL 2025 కోసం మెగా ప్లేయర్ వేలం ఉంటుందని IPL అధ్యక్షుడు అరుణ్ ధుమాల్ ధృవీకరించారు. కాబట్టి, వచ్చే ఏడాది అన్ని జట్లూ మారడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంచైజీకి ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుందని అరుణ్ ధుమాల్ తెలిపాడు. అంటే మొత్తం 25 మంది ఆటగాళ్లలో 21 మందిని జట్టు నుంచి తప్పించాల్సి ఉంటుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 ప్రారంభం కావడానికి ముందు IPL 2025కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. IPL 2025 కోసం మెగా ప్లేయర్ వేలం ఉంటుందని IPL అధ్యక్షుడు అరుణ్ ధుమాల్ ధృవీకరించారు. కాబట్టి, వచ్చే ఏడాది అన్ని జట్లూ మారడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంచైజీకి ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుందని అరుణ్ ధుమాల్ తెలిపాడు. అంటే మొత్తం 25 మంది ఆటగాళ్లలో 21 మందిని జట్టు నుంచి తప్పించాల్సి ఉంటుంది.

2 / 6
ఇక్కడ కూడా రిటైన్ చేసుకోవడానికి కొన్ని నియమాలు వర్తిస్తాయి. గతంలో ఉన్న ఐపీఎల్ మెగా వేలం నిబంధనల ప్రకారం ఒక జట్టు నలుగురు ఆటగాళ్లను ఇక్కడ ఉంచుకోవాలంటే రూ.42 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ముగ్గురిని రిటైన్ చేసుకోవాలంటే రూ.33 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ కూడా రిటైన్ చేసుకోవడానికి కొన్ని నియమాలు వర్తిస్తాయి. గతంలో ఉన్న ఐపీఎల్ మెగా వేలం నిబంధనల ప్రకారం ఒక జట్టు నలుగురు ఆటగాళ్లను ఇక్కడ ఉంచుకోవాలంటే రూ.42 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ముగ్గురిని రిటైన్ చేసుకోవాలంటే రూ.33 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

3 / 6
కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంటే రూ. 24 కోట్లు చేయాల్సి ఉంటుంది. ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకుంటే రూ.14 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే జాతీయ జట్టులో ఆడని ఆటగాడిని అట్టిపెట్టుకుంటే రూ.4 కోట్లు తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధన ఉంది. తదుపరి మెగా వేలానికి కూడా ఇదే నిబంధన వర్తించే అవకాశం ఉంది.

కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంటే రూ. 24 కోట్లు చేయాల్సి ఉంటుంది. ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకుంటే రూ.14 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే జాతీయ జట్టులో ఆడని ఆటగాడిని అట్టిపెట్టుకుంటే రూ.4 కోట్లు తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధన ఉంది. తదుపరి మెగా వేలానికి కూడా ఇదే నిబంధన వర్తించే అవకాశం ఉంది.

4 / 6
ఇక్కడ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే మొదటి ఆటగాడికి రూ.16 కోట్లు, 2వ ఆటగాడికి రూ.12 కోట్లు, 3వ ఆటగాడికి రూ.8 కోట్లు, 4వ ఆటగాడికి రూ.6 కోట్లు లభిస్తాయి.  దీని ప్రకారం మొత్తం 42 కోట్లు అవుతుంది. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి రూ.15 కోట్లు, రెండో ఆటగాడికి రూ.11 కోట్లు, మూడో ఆటగాడికి రూ.7 కోట్లు దక్కుతాయి. దీని ప్రకారం మొత్తం రూ.33 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే మొదటి ఆటగాడికి రూ.16 కోట్లు, 2వ ఆటగాడికి రూ.12 కోట్లు, 3వ ఆటగాడికి రూ.8 కోట్లు, 4వ ఆటగాడికి రూ.6 కోట్లు లభిస్తాయి. దీని ప్రకారం మొత్తం 42 కోట్లు అవుతుంది. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి రూ.15 కోట్లు, రెండో ఆటగాడికి రూ.11 కోట్లు, మూడో ఆటగాడికి రూ.7 కోట్లు దక్కుతాయి. దీని ప్రకారం మొత్తం రూ.33 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

5 / 6
ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి రూ.14 కోట్లు, రెండో ఆటగాడికి రూ.10 కోట్లు ఇవ్వాలి. దీని ప్రకారం మొత్తం రూ.24 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకుంటే రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి రూ.14 కోట్లు, రెండో ఆటగాడికి రూ.10 కోట్లు ఇవ్వాలి. దీని ప్రకారం మొత్తం రూ.24 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకుంటే రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

6 / 6
అలాగే, జాతీయ జట్టులో ఆడని ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకుంటే 4 కోట్లు ఇస్తారు. అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు అందజేసిన మొత్తం వేలం మొత్తం నుంచి తీసివేస్తుంటారు. అందువల్ల ఈసారి ఐపీఎల్ ప్రదర్శనను బట్టి వచ్చే ఏడాది జట్టు నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తేలిపోయే అవకాశం ఉంది.

అలాగే, జాతీయ జట్టులో ఆడని ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకుంటే 4 కోట్లు ఇస్తారు. అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు అందజేసిన మొత్తం వేలం మొత్తం నుంచి తీసివేస్తుంటారు. అందువల్ల ఈసారి ఐపీఎల్ ప్రదర్శనను బట్టి వచ్చే ఏడాది జట్టు నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తేలిపోయే అవకాశం ఉంది.