AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anderson Tendulkar Trophy: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు కొత్త ట్రోఫీ.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా?

ఈ నెల 20 నుంచి భారత్‌ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు క్రికెట్ సిరీస్‌ కోసం బీసీసీఐ, ఈసీబీ సంయుక్తంగా కొత్త ట్రోఫీ ప్రారంభించాయి. ఈ ట్రోఫీకి ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. వీరిద్దరూ టెస్టు క్రికెట్‌లో అసాధారణ కృషి చేసినందుకు గాను ఈ ట్రోఫీకి వారి పేరును పెట్టినట్టు బీసీసీఐ, ఈసీబీ తెలిపారు. ఈ ట్రోఫీని జూన్ 19, గురువారం లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సచిన్, ఆండర్సన్ సంయుక్తంగా ఆవిష్కరించారు. అయితే దీని ప్రత్యేక ఏమిటో తెలుసుకుందాం పదండి..

Anand T
|

Updated on: Jun 20, 2025 | 1:57 AM

Share
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, ఈ సిరీస్‌కు కొత్త పేరు పెట్టారు. ఈ సిరీస్‌ను గతంలో పటౌడి ట్రోఫీ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు దీనిని ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ అని పిలుస్తారు.

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, ఈ సిరీస్‌కు కొత్త పేరు పెట్టారు. ఈ సిరీస్‌ను గతంలో పటౌడి ట్రోఫీ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు దీనిని ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ అని పిలుస్తారు.

1 / 5
ఈ కొత్త ట్రోఫీని గురువారం జూన్ 19, 2025న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సచిన్, ఆండర్సన్ ఇద్దరూ కలిసి ఆవిష్కరించారు

ఈ కొత్త ట్రోఫీని గురువారం జూన్ 19, 2025న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సచిన్, ఆండర్సన్ ఇద్దరూ కలిసి ఆవిష్కరించారు

2 / 5
ఈ ట్రోఫీ ప్రత్యేకత ఏమిటంటే, ఆండర్సన్ బౌలింగ్ యాక్షన్, అండర్సన్‌ వేసిన బంతిని సచిన్ డ్రైవ్‌ చేస్తున్న చిత్రం దానిపై చెక్కబడి ఉన్నాయి

ఈ ట్రోఫీ ప్రత్యేకత ఏమిటంటే, ఆండర్సన్ బౌలింగ్ యాక్షన్, అండర్సన్‌ వేసిన బంతిని సచిన్ డ్రైవ్‌ చేస్తున్న చిత్రం దానిపై చెక్కబడి ఉన్నాయి

3 / 5
ఈ కొత్త ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ ట్రోఫీలో సచిన్, ఆండర్సన్ సంతకం కూడా ఉంది. ఈ ట్రోఫీపై భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుకు ఈ ట్రోఫీని అందజేస్తామని రాసి ఉంది.

ఈ కొత్త ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ ట్రోఫీలో సచిన్, ఆండర్సన్ సంతకం కూడా ఉంది. ఈ ట్రోఫీపై భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుకు ఈ ట్రోఫీని అందజేస్తామని రాసి ఉంది.

4 / 5
గతంలో ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్‌లో 'పటౌడీ ట్రోఫీ'గా, భారత్‌లో 'ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ'గా పిలిచేవారు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో విజయం సాధించిన వారికి ఈ ట్రోఫిని అందించేవారు. కానీ ఇప్పుడు గెలిచిన జట్టు కెప్టెన్‌కు పటౌడీ పతకం మాత్రయే ఇవ్వబడుతుంది.

గతంలో ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్‌లో 'పటౌడీ ట్రోఫీ'గా, భారత్‌లో 'ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ'గా పిలిచేవారు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో విజయం సాధించిన వారికి ఈ ట్రోఫిని అందించేవారు. కానీ ఇప్పుడు గెలిచిన జట్టు కెప్టెన్‌కు పటౌడీ పతకం మాత్రయే ఇవ్వబడుతుంది.

5 / 5