
కడుపులో పుండ్లు, అల్సర్, అసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే ఆయుర్వేద నిపుణుల సలహా లేకుండా రాగి పాత్రలోని నీటిని తాగొద్దు. రాగి వల్ల వేడి ఉత్పన్నమవుతుంది. ఇది మీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

కిడ్నీ లేదా గుండెకు సంబంధించిన సమస్యలుంటే ఈ నీటిని తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మేలు. రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల మీ సమస్యలు మరింత పెరిగే ప్రమాదముంది.

మీకు ఆరోగ్యం బాగా ఉంటే.. ఎలాంటి సమస్యలు లేకపోతే.. రాగి పాత్రలోని నీటిని తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. రాగి పాత్రలో వండిన ఆహారపదార్థాలను అస్సలు తినకూడదు. ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

రాగి పాత్రలో పాలు లేదా పాల ఉత్పత్తులు, పుల్లని పదార్ధాలను ఎప్పుడు కూడా తినకూడదు. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల పదార్థాలు విషపూరితంగా మారతాయని సూచిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి.