ఈ రోజుల్లో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక్క సినిమా అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బడ్జెట్ పెరిగింది.. కాన్వాస్ పెరిగింది కాబట్టి కచ్చితంగా ఏడాదికి ఒక్క సినిమా చేస్తే హ్యాపీ లేదంటే కనీసం రెండేళ్లకోసారి అయినా కనిపించంది ప్లీజ్ అంటున్నారు.
కానీ కొందరు హీరోలు మాత్రం పాన్ ఇండియా పేరు చెప్పి రెండు మూడేళ్ళు షూటింగ్ కూడా చేయట్లేదు. కావాలంటే కేజీఎఫ్ హీరో యశ్నే తీసుకోండి. ఆ సిరీస్తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు ఈ నటుడు.
అప్పటి వరకు కేవలం కన్నడలో మాత్రమే ఉన్న యశ్.. క్రేజ్ కేజియఫ్ దేశమంతా పాకింది. అయితే ఆ సినిమా తర్వాత యశ్ బాగా స్లో అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే నెక్ట్స్ ఏం చేయాలో అనే కంగారు ఈయనలో ఎక్కువైపోయింది.
ఫ్యాన్స్ కూడా యశ్ తర్వాతి సినిమా కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. మలయాళ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’కు ఓకే చెప్పారు యశ్. ఈ సినిమా ఓకే అయినా కూడా ఏడాది దాటేసింది. ఆ మధ్య ఓ ప్రీ లుక్ టీజర్ కూడా విడుదల చేసారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు మొదలు కాలేదు.
తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. 2024, ఆగస్ట్ 8 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాలి. యశ్ చివరి సినిమా కేజియఫ్ 2 షూటింగ్ మార్చ్ 31, 2021న ముగిసింది. అప్పట్నుంచి యశ్ మరో సినిమా చేయలేదు.. కేజియఫ్ 3 అనుకున్నా వర్కవుట్ అవ్వలేదు. మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత 2024, ఆగస్ట్ 8 నుంచి సెట్స్కు వెళ్ళాడు రాకింగ్ స్టార్. ఇకపై అయినా ఈ రేంజ్లో గ్యాప్ తీసుకోవద్దంటూ కోరుకుంటున్నారు అభిమానులు.