
ఇంకా ఎంతొస్తే బాహుబలి రికార్డ్ సొంతమవుతుంది..? విడుదలైన 3 వారాల తర్వాత కూడా పుష్ప 2 దూకుడు ఏ మాత్రం తగ్గట్లేదు.

తాజాగా 1700 కోట్ల క్లబ్బులోనూ చేరిపోయింది ఈ చిత్రం. పుష్ప 2కు ముందు ఈ క్లబ్బుల్లో ఉన్న ఏకైక సినిమా బాహుబలి 2. 2017లోనే ఇది చేసి చూపించారు రాజమౌళి.

కొత్త ప్రభుత్వం వచ్చాక.. సలార్, దేవర, కల్కి లాంటి సినిమాలకు భారీ టికెట్ హైక్ ఇచ్చారు. ఇక పుష్ప 2కు అయితే మునుపెన్నడూ లేనంతగా ఏకంగా ప్రీమియర్స్పైనే 800 రూపాయల హైక్ ఇచ్చింది ప్రభుత్వం. పుష్ప 2 విడుదల వరకు అన్నీ బాగానే ఉన్నాయి.

కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని ఘటనలతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వం సీరియస్ అయింది. ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోస్ ఉండవని.. టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదనే ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం రాబోయే పెద్ద సినిమాలపై ప్రభావం చూపించక మానదు.

ముఖ్యంగా సంక్రాంతికి రానున్న గేమ్ ఛేంజర్పైనే ఈ ఎఫెక్ట్ పడనుంది. అలాగే మిగిలిన సినిమాలపై కూడా..! మరి ఈ ఇష్యూపై సినిమా పెద్దలు మాట్లాడతారా..? ఒకవేళ సైలెంట్గా ఉంటే.. ఏపీలోనూ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ పెంపుకు అనుమతులు ఆపేస్తే ఏంటి అనే ఊహే టాలీవుడ్ ఫ్యూచర్ను గందరగోళంలో పడేస్తుంది.