
ఇన్నాళ్లు ఐటమ్ సాంగ్స్తో టాలీవుడ్ స్క్రీన్ మీద సందడి చేసిన ఊర్వశీ రౌతెలా, రీసెంట్గా డాకూ మహారాజ్ సినిమాలో బాలయ్యకు జోడీగా కనిపించారు. ఈ సినిమా తరువాత సౌత్ సర్కిల్స్లోనూ ఊర్వశికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

అందుకే ఈ బ్యూటీ చేసే కామంట్స్ ఇప్పుడు ఇక్కడ కూడా రచ్చ రచ్చ అవుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వార్తతో న్యూస్ హెడ్లైన్స్లో ఫ్లాష్ అవుతుంటారు ఊర్వశీ.

దబిడి దబిడీ కాంట్రవర్సీ టైమ్లోనే సైఫ్ మీద దాడి గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డారు ఈ బ్యూటీ. తరువాత సారీ చెప్పి కూల్ చేసేశారు. ఇప్పుడు మరోసారి తన మార్క్ కామెంట్స్తో రచ్చ చేస్తున్నారు.

తనకు ఉత్తరాఖండ్తో ఓ టెంపుల్ ఉందని, బద్రీనాథ్ టెంపుల్ పక్కనే తన ఆలయం ఉందన్నారు ఊర్వశీ. అంతేకాదు స్టూడెంట్స్ కూడా తనను దండమమాయి అని కొలుస్తున్నారని చెప్పారు. అక్కడితో అయిపోలేదు.

సౌత్లో కూడా తనకు అలాంటి టెంపుల్ ఒకటి ఉంటే బాగుంటదని కోరుకుంటున్నారు ఈ హాట్ బ్యూటీ. చిరు, పవన్, బాలయ్య లాంటి టాప్ హీరోలతో జోడీ కట్టిన తనకు ఓ గుడి ఉంటే బాగుండేది అంటున్నారు. మరి ఈ బ్యూటీ కోరికను ఎవరైన నెరవేరుస్తారేమో చూడాలి.