
ఉన్నచోటే ఉంటే ఏం బావుంటుందబ్బా... కొంచెం పక్కకి జరగాలి. కొత్తగా ట్రై చేయాలి. అందులో సక్సెస్ అవుతామా లేదా అన్నది తర్వాతి మాట. ముందైతే అడుగేశామా లేదా? శాయశక్తులా ట్రై చేశామా లేదా? అదీ లెక్క. ఇప్పుడు ఈ లెక్కాపత్రాలను జాగ్రత్తగా సరిచూసుకుంటున్నారు త్రివిక్రమ్. అంతకన్నా ముందు ఫ్యూయల్గా పనిచేయాల్సిన కథ సిద్ధం చేసుకుంటున్నారు.

మళ్లీ ఇలాంటి తెలుగు సినిమా ఎప్పుడు చేస్తామో తెలియదు. అందుకే పక్కా డ్యాన్స్ నెంబర్స్ ఉండేలా గుంటూరు కారం మూవీని ప్లాన్ చేసుకున్నాం అని ఆ మధ్య ఓపెన్ అయ్యారు మహేష్ బాబు. ప్యాన్ ఇండియా స్టేటస్కి ఈ సమయంలో పగ్గాలేస్తున్నది జస్ట్ మహేష్ మాత్రమే కాదు, త్రివిక్రమ్ కూడా అంటోంది ఇండస్ట్రీ.

ఈ మధ్యనే గుంటూరు కారం వైబ్స్ నుంచి బయటికొస్తున్నారు త్రివిక్రమ్. నెక్స్ట్ ఆయన ఏ హీరోతో సినిమా చేసినా, లైన్ మాత్రం ప్యాన్ ఇండియా స్పాన్ ఉండేలా చూసుకుంటున్నారట. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న తారక్తో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఉండొచ్చనే మాట ఆ మధ్య గట్టిగా వినిపించింది.

ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, సెట్స్ మీదున్న సినిమాలను పూర్తి చేశాక గురూజీతో ఓ ప్రాజెక్ట్ చేస్తారనే మాట కూడా ఎప్పటి నుంచో ఉంది. అది జరిగే టైమ్కి హరిహరవీరమల్లు ఎలాగూ విడుదలై ఉంటుంది. సో పవన్ కల్యాణ్ కూడా ప్యాన్ ఇండియా స్టార్గా ఎస్టాబ్లిష్ అయి ఉంటారు.

ఇవన్నీ కాకుండా, ఇమీడియేట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్తో అయినా సరే, మాటల మాంత్రికుడు స్ట్రాటజీ మార్చాల్సిందే. థింక్ బిగ్ అని తనకు తాను చెప్పుకుని, భారీ స్పాన్ ఉన్న కథను ఆలోచించి తీరాల్సిందే. అప్పుడే ప్యాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కాసులు కొల్లగొట్టడానికి రూట్ క్లియర్ అవుతుంది.