
బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫెఫ్సీ కొత్త కండిషన్స్పై స్పందించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తెలుగు సినిమా అన్ని భాషల టెక్నీషియన్స్ను ఎంకరేజ్ చేస్తుందన్న పవన్, తమిళ మేకర్స్ కూడా అలాగే చేస్తే బాగుంటదన్నారు. అప్పుడే తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా ట్రిపులార్ లాంటి గ్లోబల్ సినిమాలు వస్తాయన్నారు.

జూలై 28న రిలీజ్ అవుతున్న బ్రో మూవీ ప్రమోషన్ స్పీడు పెంచారు. మంగళవారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన మేకర్స్, ఓ ప్రమోషన్ సాంగ్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. గుడుంబా శంకర్ సినిమాలోని కిల్లీ కిల్లీ పాటను రీమిక్స్ చేస్తూ రూపొందించిన ఈ పాటలో పవన్తో పాటు సాయి ధరమ్ తేజ్, తమన్ కూడా నటించారు.

వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి మూవీ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా బోల్డ్ సీన్స్కు నో అంటున్నారు ఈ బ్యూటీ. కథ డిమాండ్ చేస్తూ ముద్దు సీన్ వరకు ఓకే, అంతకు మించి చేయనని క్లారిటీ ఇచ్చేశారు. ప్రజెంట్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారంతో పాటు మరో రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు మీనాక్షి.

సర్ మూవీ రిలీజ్కు ముందే మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సినిమాను ప్రారంభించారు ధనుష్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ధనుష్కు జోడి రష్మిక మందన్న నటించబోతున్నారు. బైలింగ్యువల్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కింగ్ నాగార్జున మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

సింగం ఎగైన్ కాస్టింగ్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాత రోహిత్ శెట్టి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ మాత్రమే జరుగుతుందన్న రోహిత్, ఒక్క అజయ్ దేవగన్ తప్ప మరే ఆర్టిస్ట్ను ఇంకా ఫైనల్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అంతా ఓకే అయ్యాక ఫుల్ డీటైల్స్ వెల్లడిస్తామన్నారు.