ఇప్పటికే ఫస్టాఫ్ అయిపోయింది.. సెకండాఫ్ షూట్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి జోడీ కడుతున్నారు.
అందులోనూ నమ్రత శిరోద్కర్తో పాటు రీమా సేన్, రమ్యకృష్ణ, రాజ్యలక్ష్మి రాయ్, అల్ఫోన్సా లాంటి హీరోయిన్లు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు విశ్వంభరలోనూ ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అటు ముంబై లో వార్ 2 సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ నే చేస్తున్నారు తారక్. ఇక్కడ శంషాబాద్ లో దేవర సెట్ లో తారక్ లేని సన్నివేశాలు తెరకెక్కించడం జరుగుతుంది.
ప్రభాస్ హీరోగా , మారుతీ దర్శకతం లో వస్తున్న రాజా సాబ్ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
పుష్ప2 లాగా ప్లానింగ్ చేసుకోవాలనో, ఫాలో అవ్వాలనో, పోటీ పడాలనో.. ఇలా రీజన్ ఏదైతేనేం... ఆ రకంగానూ పుష్ప మేనియా వైరల్ అవుతూనే ఉంది.
మంచు విష్ణు భక్త కన్నప్ప షూటింగ్ కూడా ఆర్ ఎఫ్ సీ జరుగుతుంది. నితిన్ హీరోగా వెంకీ కుడుములు తెరకెక్కిస్తున్న రాబిన్ హుడ్ మూవీ మొయినాబాద్ లో జరుగుతుంది.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ తీసుకుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీని కూడా కలిపి 40 కోట్లకు నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న సినిమా తండేల్.