
వినయ విదేయ రామ సినిమాతో ఆడియన్స్ను మెస్మరైజ్ చేసిన జంట రామ్ చరణ్, కియారా అద్వాని. ఆ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయినా చెర్రీ, కియారా కాంబోకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి ఆ కాంబోను రిపీట్ చేస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాలో మరోసారి చెర్రీకి జోడిగా నటిస్తున్నారు కియారా అద్వాని. ఈ మూవీ విషయంలో శంకర్, చెర్రీ కాంబో ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో... చరణ్, కియార కాంబో కూడా అదే రేంజ్లో బజ్ క్రియేట్ చేస్తోంది.

సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా హీరోయిన్ను రిపీట్ చేస్తున్న మరో హీరో నాగచైతన్య. రీసెంట్గా లవ్ స్టోరి సినిమా కోసం సాయి పల్లవితో జోడి కట్టారు చైతూ. ఈ సినిమా అనుకున్న రేంజ్లో పెర్ఫామ్ చేయకపోయినా... ఆమెతో మరో మూవీకి రెడీ అవుతున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో చైతూకి జోడిగా నటిస్తున్నారు సాయి పల్లవి.

బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కల్యాణ్ రామ్ కూడా తన లక్కీ గర్ల్ను వెంటనే రిపీట్ చేస్తున్నారు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న డెవిల్ సినిమాలోనూ సంయుక్త మీనన్తోనే జోడి కట్టారు నందమూరి హీరో.

ఇక టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కాంబో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ జంట తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలోనూ అలరించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబోనే తెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.