మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.
2011లో వేటిమారన్ దర్శకత్వం వహించిన ధనుష్ చిత్రం ఆడుకలంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టాడు.అలాగే ఆమె 2013లో వరుణ్ ధావన్ యొక్క షష్మే బాదూర్ చిత్రంలో నటించడం ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
రెగ్యులర్ హీరోయిన్ అయిన తాప్సీ బేబీ, పింక్, ది ఘాజీ ఎటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక నటిగా నిరూపించుకుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న తాప్సీ పన్ను ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తోంది.
తాప్సీ పన్ను తన అద్భుతమైన నటనకు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు అలాగే ఫిల్మ్ఫేర్ OTT అవార్డుతో సహా పలు అవార్డులను అందుకుంది.తాప్సీ పన్ను హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది.
నటి తాప్సీ పన్ను ఈరోజు తన 37వ పుట్టినరోజు జరుపుకుంటుంది. అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా తాప్సీ పన్ను బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.