
గుంటూరు కారం రిలీజ్ అయిపోయింది. ఇక రిజల్ట్ విషయం ఫ్యాన్స్ చేతిలో ఉంది.. దీంతో ఫోకస్ నెమ్మదిగా మహేష్ నెక్ట్స్ మూవీ మీదకు షిప్ట్ అవుతోంది. ఆల్రెడీ జక్కన్నతో మూవీ కమిట్ అయిన మహేష్ ఆ సినిమా వర్క్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

రాజమౌళి, మహేష్ కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి. గుంటూరు కారం వైబ్ చూసిన తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గ ప్లాట్ఫామ్ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి.

ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉన్న జక్కన్న త్వరలో అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వన్స్ గుంటూరు కారం ప్రమోషన్ వర్క్ కూడా ఫినిష్ అయితే నెక్ట్స్ మూవీ మీద ఫోకస్ పెడతారు మహేష్.

ఈ లోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మ్యాగ్జిమమ్ ఫినిష్ చేసి వర్క్ షాప్లకు రెడీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ కావటంతో ఆరు నెలల పాటు వర్క్షాప్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.

షూటింగ్ విషయంలో కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. బాహుబలి, ట్రిపులార్ తరహాలోనే ఎక్కువ భాగం సెట్లో షూటింగ్ చేయాలన్నది రాజమౌళి స్కెచ్. అందుకే భారీ సెట్ను సిద్ధం చేస్తున్నారు.

కేవలం సెట్ కోసమే ఓ సినిమాకు పెట్టినంత బడ్జెట్ ఖర్చు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ లాక్ చేసిన రాజమౌళి, సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు.

ఈ ఏడాదిలోనూ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే 2026లో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ప్లానింగ్ అనుకున్నట్టుగా జరగాలని గట్టిగా కోరుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.