Shruti Haasan
ప్రేమ గొప్పతన్నాన్ని చెప్పేలా శ్రుతిహాసన్ ఓ పాటను రాసి, కంపోజ్ చేశారు. ఈ మ్యూజికల్ ఆల్బమ్లో శ్రుతితో కలిసి లోకేష్ తెరపై కనిపిస్తారు. లోకేష్ హీరోగా నటిస్తారంటూ ఇప్పటికే చాలా సార్లు వార్తలొచ్చాయి. వాటిని లోకేష్ ఎప్పుడూ కొట్టిపారేయలేదు. నియర్ ఫ్యూచర్లో అన్బరివు డైరక్షన్లో ఓ సినిమా చేస్తారనే టాక్ కూడా స్పీడ్గానే స్ప్రెడ్ అవుతోంది.
ఈ తరం హీరోయిన్లలో మైథలాజికల్ సబ్జెక్టులను కూడా అడపాదడపా టచ్ చేస్తున్న నాయికగా పేరుంది నయనతారకు. ఆల్రెడీ మూకుత్తి అమ్మన్ సినిమాలో నటించి మెప్పించారు నయన్. శ్రీరామరాజ్యంలో సీతాదేవిగానూ ప్రశంసలు అందుకున్నారు. లేటెస్ట్ గా అలాంటిదే మరో సినిమాలో నటిస్తారంటూ నయన్ పేరు మారుమోగుతోంది.
ఆడివెళ్లి అనే సినిమా రీమేక్లో నయనతార నటిస్తారన్నది వైరల్ న్యూస్. అప్పట్లో తమిళంలో సూపర్డూపర్ హిట్ అయింది ఆ సినిమా.తెలుగులోనూ శ్రావణ శుక్రవారం పేరుతో రిలీజ్ అయి జనాదరణ పొందింది. ఈ సినిమాలో నయన్ అమ్మవారి రోల్లో సందడి చేస్తారనే విషయం నిజమేనా అనే విషయంపై నిర్మాత తేనాండాళ్ మురళి స్పందించారు.
సినిమాను రీమేక్ చేస్తున్నమాట నిజమే, నయనతారగారు చేస్తే బావుంటుందని మేం భావిస్తున్నాం. ఇంకా ఆమెను అప్రోచ్ కాలేదు, కథాపరమైన మార్పులన్నీ పగడ్బంధీగా పూర్తయ్యాక వెళ్లి కలవాలని అనుకుంటున్నామని చెప్పారు మురళి. సో అదీ సంగతి.. బాల్ ఇంకా నయన్ కోర్టుకి చేరలేదన్నమాట.