
సూపర్స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ చేసిన సినిమా లాల్సలామ్. 2024 పొంగల్ రేసులో నిలుచున్న ఈ సినిమా, తొక్కిడి వద్దనుకుని ఫిబ్రవరి 9న రిలీజ్ అయింది. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాను డైరక్ట్ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో లాల్ సలామ్కి పూర్ ఆక్యుపెన్సీ ఉండటంతో షోలు కేన్సిల్ అయ్యాయట.

ఆల్రెడీ బుక్ చేసుకున్నవారికి టికెటింగ్ ప్లాట్ఫార్మ్స్ రీఫండ్ కూడా చేశాయట. అయితే పూర్ ఆక్యుపెన్సీ వల్ల షోలు రద్దు కాలేదని, లోడింగ్ ఇబ్బందుల వల్లనే అలా జరిగిందనే ప్రచారం ఇంకో వైపు జరుగుతోంది. లైకా ప్రొడక్షన్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ చేశారు. జీవిత రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు.

అప్పుడెప్పుడో తెలుగులో ఓ సినిమా చేసిన బ్యూటీ... దిశా పటాని అని అంటే, ఎంత మందికి గుర్తుంటుందో ఏమోగానీ, టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్, సోషల్ మీడియా ఫ్రీక్ అంటే మాత్రం చటుక్కున ఆమె పేరు గుర్తుకొచ్చి తీరుతుంది. లేటెస్ట్ గా అయితే కల్కి 2898 ఏడీలో ప్రభాస్తో యాక్ట్ చేస్తున్నారు దిశా పటాని.

అటు సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమాలోనూ దిశా పటాని నాయికగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు అల్లు అర్జున్ పక్కన కూడా దిదిశా పటాని మెరవబోతున్నారు. పుష్ప ది రెయిజ్లో ఉ అంటావా మావా అంటూ సమంత స్టెప్పులేస్తే జనాలు ఫిదా అయిపోయారు. ఇప్పుడు సెకండ్ పార్టులో అలాంటి పాటలో కృతిసనన్, దిశా పటాని కలిసి స్టెప్పులేశారన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది.

తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ ఎంట్రీ ఇప్పుడు సంచలనంగా మారింది. దళపతి ఎంట్రీ ఇవ్వగానే, విశాల్ కూడా వచ్చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే, తాను ప్రజా సేవ చేయడానికి రాజకీయాలు అక్కర్లేదని విశాల్ ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. దీని గురించి విశాల్ తండ్రి జీకే రెడ్డి స్పందించారు. విజయ్లాగా విశాల్ కూడా బాగా సంపాదించుకుని, పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాక రాజకీయాల్లోకి వస్తే బావుంటుందని అన్నారు. ఇప్పటికే విశాల్ ఎంతో మందిని చదివిస్తున్నాడు. ప్రతి నెలా 30 నుంచి 40 లక్షల రూపాయలదాకా ఖర్చవుతోంది. ఈ ఖర్చులు భరించడానికి కొన్నిసార్లు అప్పులు చేస్తున్నాడని అన్నారు జీకే రెడ్డి. ఇలాంటి ఈతిబాధల నుంచి బయటపడాలంటే, ముందు సినిమాల్లో బాగా సంపాదించాలని సూచించారు.