
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చెల్లి సాయి ప్రదీప్తి తిరుమల లో సందడి చేసింది. సోమవారం (అక్టోబర్ 27) ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకుంది.

దర్శనానంతరం ఆలయం బయటకు వచ్చిన సాయి ప్రదీప్తి ని చూసిన భక్తులు ఆమెతో కలిసి ఫొటోలు, సెల్ఫీల దిగేందుకు పోటీ పడ్డారు.

హీరో ప్రభాస్ కు మొత్తం నలుగురు చెల్లెళ్లు ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కూతుళ్లు. అయినా వీరెంతో అన్యోన్యంగా కలిసే ఉంటారు.

ఈ నలుగురు చెల్లెళ్లలో ఇప్పటికే ప్రసీద సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటోంది.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా హీరో చేతిలో అరడజనకు పైగా సినిమాలున్నాయి. ఇందులో ది రాజా సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది రాజా సాబ్ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ఫౌజి సినిమాలు కూడా ప్రభాస కంప్లీట్ చేయాల్సి ఉంది. అలాగే హనుమాన్ దర్శకుడితోనూ ఓ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.