
సలార్, కల్కి సినిమాల సక్సెస్ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్. ఈ అప్డేట్స్తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి..? అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరి.

కల్కి 2898 ఏడీ సక్సెస్ జోష్లో ఉండగానే ది రాజాసాబ్ గ్లింప్స్తో సర్ప్రైజ్ చేశారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లోనే బిజీగా ఉన్న ప్రభాస్, నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 10న మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు.

లేటెస్ట్ ఇంటర్వ్యూలో ది రాజాసాబ్ గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్. ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమాను నిర్మించిన భూషణ్ కుమార్, త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే స్పిరిట్ మూవీని కూడా నిర్మిస్తున్నారు. అందుకే ఎక్కువగా డార్లింగ్తో ట్రావెల్ చేస్తున్నారు.

స్పిరిట్ సినిమాను డిసెంబర్లో అఫీషియల్గా లాంచ్ చేసి ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ అప్డేట్స్ ఇచ్చిన భూషణ్ కుమార్, ది రాజాసాబ్ గురించి కూడా మాట్లాడారు. రీసెంట్గా తాను రాజాసాబ్ సినిమాకు సంబంధించిన సీన్స్ చూశానన్న భూషణ్, ఆ సీన్స్ హాలీవుడ్ మూవీ హారీపోట్టర్ రేంజ్లో ఉన్నాయన్నారు.

ది రాజాసాబ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కూడా ఇలాంటి కామెంట్సే చేశారు. ఈ సినిమా స్కేల్, మేకింగ్ భారీ స్థాయిలో జరుగుతున్నాయని, ఆడియన్స్ బిగ్ స్క్రీన్ మీద సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పారు. ఈ అప్డేట్స్తో డార్లింగ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్లిపోయారు.