చుట్టూ జనాలందరూ పోలింగ్ డే జోరులో కనిపిస్తే, మహేష్ ఫ్యాన్స్ మాత్రం తమకు కావాల్సిన అప్డేట్ వచ్చిందని హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ మహేష్ ఏమైనా చెప్పారా? లేకుంటే టెక్నీషియన్లు ఎక్కడైనా లీక్ చేశారా? ఉన్నపళాన ఘట్టమనేని అభిమానుల్లో ఆ జోష్కి రీజన్ ఏంటి? డీటైల్స్ చూద్దాం వచ్చేయండి...
గుర్తుందా? రీసెంట్గా దుబాయ్లో బాగా వర్షాలు పడుతున్నాయని అక్కడ చేస్తున్న పనికి కామా పెట్టేసి వచ్చేశారు సూపర్స్టార్ మహేష్, డైరక్టర్ రాజమౌళి అండ్ ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ. ఆ తర్వాత మహేష్ - రాజమౌళి సినిమా గురించి చెప్పుకోదగ్గ అప్డేట్ అయితే లేదు.
కానీ ఎలక్షన్ డే రోజు రాజమౌళి పెట్టిన సోషల్ మీడియా పోస్టు మహేష్ ఫ్యాన్స్ కి చాలా విషయాలను చెప్పకుండానే చెప్పేసింది. ఓటు కోసం దుబాయ్ నుంచి వచ్చామని పోస్ట్ పెట్టారు రాజమౌళి. దీన్ని బట్టి, మహేష్ మూవీ స్టోరీ డిస్కషన్స్ దుబాయ్లో శరవేగంగా జరుగుతున్నాయనే హింట్స్ అందుతున్నాయి.
మరోవైపు స్టోరీ డిస్కషన్స్ తో అప్డేట్ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి ముందు ఆ మాత్రం హోమ్ వర్క్ చేయాలి కదా అన్నది మహేష్ నుంచి వినిపిస్తున్న మాట.
అమేజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీ ఇది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా రాలేదన్నట్టు తెరకెక్కించాలన్నది రాజమౌళి కల అట. బడ్జెట్ పరంగా లిమిట్స్ పెట్టుకోలేదని, ప్రాజెక్ట్ స్పాన్ని బట్టి ఖర్చుపెట్టడానికి రెడీగా ఉన్నానని అంటున్నారు ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ.