సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది పొడుగుకాళ్ల సుందరి కృతిసనన్.
వన్ నేనొక్కడినే సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ కృతిసనన్ నటనకు , అందానికి మంచి మార్కులు పడ్డాయి.
ఆతర్వాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా నిరాశపరిచింది. దాంతో బాలీవుడ్ కు తిరిగి చెక్కేసింది.
అక్కడ వరుసగా ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉండే కృతిసనన్ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది