
బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించింది.

మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఆతర్వాత తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. ఆక్కడ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది కృతి.

ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో సీత పాత్రలో మెప్పించింది కృతి సనన్.

ఇదిలా ఉంటే ఇప్పుడు ముంబైలో కాస్ట్లీ ఇల్లు కొనుగోలు చేసింది కృతి సనన్. ఈ ఇంటి ధర సుమారు 35 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.