స్టార్ హీరోలు అందరి సినిమాల నుంచి ఏదో ఒక రకమైన అప్డేట్ లు ఉంటూనే ఉన్నాయి. మా హీరో మాత్రం ఎందుకో సడన్గా సైలెంట్ అయ్యారు. ఈ ఏడాది పొంగల్ని మిస్ చేశారు. పోనీ, ఇంకేమైనా అప్డేట్స్ ఇస్తున్నారా? అంటే అదీ లేదు... అని రకరకాల రీజన్స్ ని గుర్తుచేసుకుని ఉస్సూరుమనాల్సిన అవసరం లేదు అజిత్ ఫ్యాన్స్.
ఇటీవలే విడాముయర్చి సినిమా కోసం ఫ్లైట్ ఎక్కిన తల ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? మరి ఆయన వచ్చేస్తే, మిగిలిన టీమ్ అక్కడే ఉంటుందా?
కోలీవుడ్ తల అజిత్ ఇప్పుడు ఇండియాకి వచ్చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అజర్బైజాన్లో ఉన్న ఆయన సోమవారం ఇండియాలో ల్యాండ్ కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈ పొంగల్ హంగామాని కూడా యాడ్ చేసి వచ్చే ఏడాది డబుల్, ట్రిపుల్గా థియేటర్లలో దుమ్మురేపడానికి మేం రెడీ అంటున్నారు ఫ్యాన్స్. 2025 పొంగల్కి పక్కాగా విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్.
ఆల్రెడీ అజిత్ చేస్తున్న విడాముయర్చి సినిమా ఈ ఏడాది అక్టోబర్లో విడుదలవుతుందనే టాక్ ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ రెండు మూవీస్తో పండగ చేసుకోబోతున్నారు తల అభిమానులు.