సినిమాలతో పటు చాలా మంది సీరియల్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అలాంటి వారిలో జ్యోతి రాయ్ ఒకరు. గుప్పెడంత మనస్సు సీరియల్ తో జ్యోతి రాయ్ చాలా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్ లో పద్దతిగా కనిపించిన ఆమె..
సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. హాట్ హాట్ ఫోటోలు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. ఈ అమ్మడి అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
నటనతో, అందంతో ఆకట్టుకున్న జ్యోతి రాయ్ పర్సనల్ లైఫ్ గురించి నిత్యం ఎదో ఓ వార్త వైరల్ అవుతూనే ఉంది. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా దీని పై స్పందించింది జ్యోతి రాయ్.
జ్యోతి రాయ్ ఓ డైరెక్టర్ ను పెళ్లాడిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు ఆమె భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'ఏ మాస్టర్ పీస్' అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు.
ఈ టీజర్ లాంచ్ లో జ్యోతి రాయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో తన జీవితం ఓ మలుపు తిరిగిందని జ్యోతి రాయ్ అన్నారు. అదే దర్శకుడు సుకు పూర్వజ్ తో పెళ్లి. ఈ పెళ్లితో టాలీవుడ్ తనకు మెట్టినిల్లు అయ్యిందని, ఇక పై తెలుగులో సినిమాలు చేస్తానని తెలిపింది.