
సూసేకి అగ్గిపుల్ల మాదిరి.. అంటూ పాటలో శ్రీవల్లి ఎంత ముద్దుముద్దుగా పాడుకుందో... రేపు సినిమా చూసే ఆడియన్స్ కూడా అంతే ఎగ్జయిట్ కావాలి. అప్పుడే కంటెంట్ ఎంత సేపున్నా బేఫికర్గా చూస్తారు ఆడియన్స్.

అలా కాకుండా... ల్యాగ్లతో ఎపిసోడ్స్ వదిలేస్తే మాత్రం చాలా ఇబ్బందవుతుంది. ఇన్ని విషయాలు తెలిసినా... మూడు గంటల 21 నిమిషాలతో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు సుకు అనేది ఫిల్మ్ నగర్ టాక్.

మూడు గంటలకు పైగా సినిమా సాగిందంటేనే.. కథ గ్రిప్పింగ్గా ఉండాలి. స్క్రీన్ప్లేలో దూకుడు కనిపించాలి. ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉండాలి. కామెడీ కడుపుబ్బ నవ్వించాలి. ఎమోషన్స్ కంటతడి పెట్టించాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉండాలి.

ఒకసారి కలిసొచ్చిన సెంటిమెంట్ విడిచిపెట్టడానికి అంత ఈజీగా వదిలిపెట్టరు మన హీరోలు. అందులోనూ అద్భుతంగా కలిసొచ్చింది అయితే అస్సలు వదిలే ముచ్చటే లేదంటారు.

ఆరేళ్ళ తర్వాత మరో ఇండియన్ సినిమా 1700 కోట్లు వసూలు చేసింది.. అది కూడా కేవలం 21 రోజుల్లోనే..! ఇప్పటికే హిందీలో 740 కోట్లతో ఆల్టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2.