అవతార్ మొదటి భాగం నేల మీద అయిపోయింది.. అవతార్ 2 నీళ్ళలో నడిపించేసారు.. మరి అవాతర్ 3 ఎలా ఉండబోతుంది..? పార్ట్ 3ని జేమ్స్ కామెరూన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు..? ఈ కథల్ని ఇండియన్ మైథాలజీ చుట్టూ అల్లుకుంటున్నారా..? పంచ భూతాలే అవతార్కు పునాది అయ్యాయా..? ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం నేపథ్యంపై జేమ్స్ కామెరూన్ క్లారిటీ ఇచ్చారు. మరి అదేంటి..?
పేరుకు హాలీవుడ్ సినిమా అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూన్ సినిమాలు. ఈయన చేసిన టైటానిక్, అవతార్ మన సినిమాల కంటే ఎక్కువగా వసూలు చేసాయి. అంతెందుకు ఏడాదిన్నర కింద అవతార్ 2 కూడా ఇండియాలో దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
దాంతో కామెరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని మళ్లీ నిరూపించింది అవతార్ 2.జేమ్స్ కెమారూన్ కూడా తన సినిమాల నేపథ్యాన్ని ఇండియన్ మైథాలజీ నుంచే తీసుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా పంచ భూతాలే అవతార్ కథకు స్పూర్థి అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేసారు జేమ్స్. అవతార్ 2 అంతా నీళ్ళలో ఉంటుంది. అందుకే టైటిల్ అవతార్ వే ఆఫ్ వాటర్ అని పెట్టారు జేమ్స్ కామేరూన్. మూడో భాగం నిప్పు నేపథ్యంలో ఉండబోతుంది.
తాజాగా అవతార్ 3 అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందులో భాగంగానే పార్ట్ 3కి ఫైర్ అండ్ ఆష్ అనే టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెట్కైనా అనే రెండు కొత్త తెగలను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు ఈ దర్శక దిగ్గజం. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి నేల, నీరు, నిప్పు అయ్యాయి.. ఇక ఆకాశం, వాయువు మాత్రమే మిగిలాయి.