
నేనేం పాపం చేసాన్రా.. కష్టాలన్నీ కంబైండ్గా నాపై ఇలా అటాక్ చేస్తున్నాయ్.! ఈ మాటలిప్పుడు పూజా హెగ్డేకు బాగా సూట్ అవుతాయి. షూటింగ్ మొదలైన సినిమాల్లోంచి తీసేస్తున్నారు.. సైన్ చేసిన సినిమాలేమో సడన్గా ఆగిపోతున్నాయి.

పూజా కెరీర్ ఇక ఎండ్ అయినట్లేనా.. ఈ సంకేతాలన్నీ అవే సూచిస్తున్నాయా..? అసలు బుట్టబొమ్మ కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా..? పాపం పూజా హెగ్డే.. ఇప్పుడు ఈమెను చూస్తుంటే ఈ మాట తప్ప మరోటి అనట్లేదు అభిమానులు.

రెండేళ్ల కింది వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో తెలియనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్తో అనుకున్న గాంజా శంకర్ కూడా ఆగిపోయిందని తెలుస్తుంది.

దాంతో పూజా బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతూనే ఉంది. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్లో ప్లాన్ చేసిన గాంజా శంకర్ బడ్జెట్ ఇష్యూస్తో ప్రస్తుతానికి ఆపేసారు.

గతంలోనూ పూజా హెగ్డేకు ఇలాంటి షాకులు తగిలాయి. గుంటూరు కారంలో రెండు షెడ్యూల్స్ అయ్యాక.. పూజా తప్పుకున్నారు. లేదంటే ఓ మై బేబీ అంటూ శ్రీలీల ప్లేస్లో హాయిగా మహేష్ బాబుతో డ్యూయెట్లు పాడుకునేవాళ్లు పూజా.

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ప్రకటించిన జనగణమన సైతం ఓ షెడ్యూల్ అయ్యాక ఆగిపోయింది. అదీ పూజా కెరీర్పైనే ఎఫెక్ట్ చూపించింది.

2022 నుంచే పూజాకు బ్యాడ్ టైమ్ మొదలైంది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ అంటూ వరస ఫ్లాపులు అదే ఏడాది వచ్చాయి. 2023లోనూ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఫ్లాపైంది. పూజా హెగ్డే కెరీర్ గాడిన పడాలంటే.. ఇప్పటికప్పుడు ఏదైనా అద్భుతం జరగాల్సిందే.