
క్రికెట్లో మెయిన్ టీమ్తో పాటు బెంచ్ కూడా బలంగా ఉన్నపుడే కదా టీం సత్తా తెలిసేది. మన హీరోలు ఇదే చేస్తున్నారిపుడు. ప్రస్తుతం పని చేస్తున్న దర్శకులతో పాటు స్టాండ్ బై బలంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అచ్చొచ్చిన దర్శకులను ముందుగానే స్టాండ్ బైలో పెట్టుకుంటున్నారు. ఒకే దర్శకుడితో మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో నడుస్తున్న ఇదే ట్రెండ్ నడుస్తుందిప్పుడు.

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కలుస్తున్నాయంటే చాలు ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. దీన్నే ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు మన హీరోలు కూడా. తమకు అచ్చొచ్చిన దర్శకులను ఓ పట్టాన వదలడానికి వాళ్లకు మనసు రావట్లేదు. అందుకే రెండు మూడేళ్ళకోసారి వాళ్లతోనే ఓ సినిమా అనౌన్స్ చేస్తున్నారు. బాలయ్య, బన్నీ, రవితేజ అంతా ఇదే దారిలోనే వెళ్తున్నారిప్పుడు.

ఓ సినిమా చేస్తున్నపుడే.. తమకు కలిసొచ్చిన దర్శకులను క్యూలో పెడుతున్నారు హీరోలు. అల్లు అర్జున్నే తీసుకోండి.. ఓ వైపు పుష్ప 2తో బిజీగా ఉన్న బన్నీ.. అంతలోనే త్రివిక్రమ్ను స్టాండ్ బైలో పెట్టేసారు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి సినిమాలు వచ్చాయి. త్వరలోనే మరో సినిమా కూడా రాబోతుందనే ప్రకటన కూడా వచ్చేసింది.

Mirapakayరవితేజ సైతం ఇదే చేస్తున్నారిప్పుడు. గోపీచంద్ మలినేనితో అనుకున్న సినిమా ఆగిపోయినా కూడా వెంటనే తనకు కలిసొచ్చిన హరీష్ శంకర్ను లైన్లోకి తీసుకొచ్చారు. ఈ కాంబినేషన్లో మిస్టర్ బచ్చన్ వచ్చేస్తుంది. షాక్, మిరపకాయ్ తర్వాత మూడోసారి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. అన్నట్లు రవితేజ ఇప్పుడు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు.

బాలయ్య సైతం తన స్టాండ్ బైలో బోయపాటిని ఎప్పుడూ దాచుకునే ఉంటారు. ఓవైపు బాబీ సినిమాలో నటిస్తూనే.. బోయపాటితో నాలుగో కాంబినేషన్ కోసం కథ సిద్ధం చేయిస్తున్నారు NBK. 2024 ఎన్నికల తర్వాత కచ్చితంగా ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడం ఖాయం. ఇలా మన హీరోలంతా కలిసొచ్చిన దర్శకులతో కనీసం రెండు మూడేళ్లకోసారి సినిమా చేస్తున్నారు.