
కుమారి 21 ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. అంతకు ముందు వరుణ్ సందేష్ తో కలిసి అలా ఎలా అనే సినిమా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది ఈ వయ్యారి.

ప్రస్తుతం ఈ చిన్నదానికి సినిమా అవకాశాలు తగ్గాయి. దాంతో స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తుంది. అంతే కాదు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా హెబ్బా పటేల్ వదిలిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

మెరూన్ కలర్ డ్రస్ లో మెరుపులు మెరిపించింది హెబ్బా. ఈ ఫోటోలకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిన్నది హీరోయిన్ గా కాకపోయినా సెకండ్ హీరోయిన్ గా అయినా హెబ్బా పటేల్ అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.