
19 ఏప్రిల్ 1990 తెలంగాణలోని చారిత్రాత్మక నగరం వరంగల్ లో ఓ తెలుగు హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ ఈషా రెబ్బ. ఈ బ్యూటీ పుట్టుంది వరంగల్ లో అయినప్పటికీ పెరిగింది మాత్రం హైదరాబాద్ నగరంలోనే.

హైదరాబాద్ లోని వరంగల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది. ప్రముఖ కళాశాల నుంచి మాస్టర్స్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)లో డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.

Heroine Eesha చదువు పూర్తయిన తర్వాత 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ కెరీర్ మొదలైంది మాత్రం అంతక ముందు ఆ తర్వాత అనే ఓ రోమాంటిక్ సినిమాతో..

తర్వాత రొమాంటిక్-కామెడీ చిత్రం అమీ తుమీలో కథానాయకిగా మెప్పించింది. ఇందులో ఆమె నటనకు మూడు అవార్డులు కూడా లభించాయి. మాయా మాల్, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది ఈ వయ్యారి. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా హీరోయిన్ గా సినిమాలు చేసింది.

తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సామెత వీర రాఘవ నుంచి సెకండ్ హీరోయిన్ గా మారింది ఈ వయ్యారి. 2023 లో మామా మశ్చీంద్రలో మరోసారి కథానాయకిగా కనిపించింది. 3 రోజెస్, పిట్టా కథలు, మాయ బజార్ ఫర్ సేల్, దయ వంటి వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది.