
లైగర్ షాక్ నుంచి కోలుకున్నారు విజయ్ దేవరకొండ. ఆల్రెడీ ఖుషీ ఇచ్చిన హిట్తో హ్యాపీగా మూవ్ అయిపోయారు. ఈ సమ్మర్లో సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ, పూరి జగన్నాథ్ సంగతేంటి?

లైగర్తో ప్యాన్ ఇండియా ఎంట్రీ జబర్దస్త్ గా ఉంటుందని అనుకున్నారు. కానీ అనుకున్నదొకటీ, అయినదొకటి.. ఇంతకీ పూరి ప్రెజెంట్ ప్రాజెక్ట్ సంగతేంటి? లైగర్ సినిమాను ప్యాన్ రేంజ్లో రీచ్ చేయించడం కోసం చెప్పులరిగేలా తిరిగారు విజయ్ దేవరకొండ.

అప్పుడు ఆయన పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అయితేనేం... వెంటనే ఖుషీతో బౌన్స్ బ్యాక్ అయ్యారు రౌడీ హీరో. కశ్మీర్ అందాలు సాక్షిగా ఆయన ఈ సినిమాతో సంబరాలు చేసుకున్నారు.

ఖుషీ డేస్ని ఫ్యామిలీ స్టార్ రీ క్రియేట్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది యూనిట్లో. పక్కా ఫ్యామిలీమేన్గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్న దృశ్యాలు చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదన్నది పాజిటివ్ సైన్.

సమ్మర్లో ఈ సినిమా కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పకనే చెబుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిన పాజిటివ్ బజ్. అటు పూరి జగన్నాథ్ మాత్రం ఇంకా లైగర్ నుంచి కోలుకోవడం లేదు. తనకు భీభత్సంగా పేరు తెచ్చిపెట్టిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ని స్టార్ట్ చేశారు పూరి.

రేయ్ ఇస్మార్ట్ నువ్వు తోపురా అని పూరి జగన్నాథ్ అంటే హ్యాపీగా ఫీలయిన క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు రామ్ పోతినేని. డబుల్ ఇస్మార్ట్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

ఆల్రెడీ టీజర్ రఫ్ కట్ చూసిన పూరి కొడుకు చెప్పిన మాటలు రామ్ పోతినేని ఫ్యాన్స్ లో హుషారు పుట్టిస్తున్నాయి. సినిమా నెక్స్ట్ లెవల్లో వస్తుందన్నది ఆకాష్ మాట. మరి... ఆ మోస్ట్ వాంటెడ్ హిట్, పూరి అండ్ రామ్ కి డబుల్ ఇస్మార్ట్ అయినా అందిస్తుందా?